జనవరి 20 నుండి ఫిబ్రవరి 10 వరకూ తెలంగాణా రాష్ట్రంలో జరగనున్న శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ లో పూజ్య స్వామిజీలు గ్రామగ్రామానికి పర్యటించడానికి కార్యచరణ రూపొందించారు. తమ తమ పీఠాలు , మఠాల నుండి కూడా రామ మందిర నిర్మాణానికి నిధిని ప్రకటించారు.
హైదరాబాద్లోని శ్రీ శ్యాంబాబా మందిర్, కాచిగూడ లో జరిగిన ధర్మాచార్యుల సమ్మేళనంలో పూజ్య శ్రీ శ్రీనివాస వ్రతధర రామానుజ జీయర్ స్వామి వారు , కేంద్ర మార్గదర్శక మండలి సభ్యులు పూజ్య శ్రీ సంగ్రామ్ మహరాజ్ స్వామిజీ, స్వామి శ్రీరామానంద ప్రభుజీ , శ్రీ సిద్దేశ్వరానందగిరి స్వామి, శ్రీ ఆత్మానంద భారతి స్వామి , . శ్రీ రత్నానంద స్వామి, శ్రీ గణేష్ మహరాజ్ స్వామి , . శ్రీ సోమలింగ శివాచార్య మహాస్వామి జీ, శ్రీ సత్యానందపురి అప్ప స్వామి , శ్రీ పూజ్యపాద రాజయోగి స్వామిజీ , గురుమాతశ్రీ శ్రీమతి దివ్య శ్రీరమణ చక్రవర్తుల మాతాజీ , శ్రీ శంకర్ గిరి స్వామిజీ , శ్రీ చైతన్య స్వామిజీ లు పాల్గొని మార్గదర్శనం చేశారు.

ఈ కార్యక్రమంలో VHP జాతీయ సహా కార్యదర్శి సత్యం, రాష్ట్ర అధ్యక్షులు M. రామరాజు, నిధి సమర్పణ అభియాన్ తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ బండారి రమేష్ , నిధి సమర్పణ అభియాన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వీసం శెట్టి విద్యాసాగర్ పాల్గొని తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోతున్న కార్యచరణ విధి విధానాలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కరపత్రాలను విడుదల చేయడం జరిగింది.